వరంగల్ : ఇద్దురు రైతులు సోమవారం విద్యుదాఘాతానికి బలైయ్యారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలంలో ఉన్న గ్రోమోర్ ఎరువల కంపెనీలో కరెంట్ షాక్ తో ఇద్దరు రైతులు మృతిచెందిన దుర్ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు రైతులు విద్యుదాఘాతం బారిన పడగా ఇద్దరు రైతులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు.