కాకినాడ : విధుల నుంచి తొలగించడంతో మనస్తాపానికి గురైన ఓ ఉద్యోగి వాటర ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్ చల్ సృష్టించాడు. తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆర్ డబ్ల్యుఎస్ ఉద్యోగి తన ఉద్యోగం కోల్పోవడంతో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. సకాలంలో స్థానికులు స్పందించడంతో అతన్ని కాపాడగలిగారు.