ఎయిడ్స్ నిర్మూలనకు ఐసిటిసి కేంద్రాలు
నిజమాబాద్ : జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు ప్రత్యేకంగా తొమ్మిది ఐసిటిసి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు నిజమాబాద్ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మేనేజర్ రాధకృష్ణ తెలిపారు. బాల్కొండలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 30 చోట్ల ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. అదనంగా కోటగిరి, లింగంపేట్, వేల్పూర్, నాగిరెడ్డి పేట, జుక్కల్, నిజాంసాగర్, మోర్తాడ్, నిజామాబాద్ లోని గౌతంనగర్ తో పాటు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసిటిసి కేంద్రాలను నెలకొల్పుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేంద్రాల్లో ఎయిడ్స్ వ్యాధి పరీక్షలతో పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఆయన వివరించారు.
News Posted: 14 July, 2009
|