రాజమండ్రి : గోదావరి నదిలో నీటిమట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నదికి ఎగువ కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరిలో వరద నీటి ఉధృతం పెరగడంతో అధికారులు 22 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. దీంతో గోదావరిలో బుధవారం నీటిమట్టం స్వల్పంగా తగ్గింది.