గుంటూరు : గుంటూరు జిల్లాలో ఓ ప్రైవేట్ బస్ బోల్తా పడడంతో పదిమంది ప్రయాణీకులు గాడపడ్డారు. పత్తిపాడు మండలం పుల్లడిగుంట సమీపంలో ఓ ప్రైవేట్ బస్సు బుధవారం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పదిమంది ప్రయాణికులు గాయపడ్డారు. గాడపడిన ప్రయాణీకులలో గర్భిణీ స్త్రీ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.