బారులు తీరిన రైతులు
అనంతపురం : రైతులకు కంది విత్తనాలను పంపిణీ చేస్తామని అధికారులు చెప్పడంతో ఉదయం నుంచే రైతులు అనంతపురం జిల్లా ఉరవకొండలో కంది విత్తనాలకోసం బారులు తీరారు. వర్షాభావంతో అల్లాడుతున్న రైతులకు ఆశాకిరణంగా కంది విత్తనాలను చేతికంది పంట పండిస్తే తమకు ఎంతో మేలు జరుగుతుందని ఆశించిన రైతులు తమకు అందవేమోన్న ఆతుతరతో విత్తనాల కోసం రైతులు ఎగబడ్డారు. దీంతో తోపులాట సంభవించింది. ఈ తోపులాటలో పలువురు రైతులు కిందపడ్డారు.ఈ ఘటనతో రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం మొదలైంది.
News Posted: 15 July, 2009
|