అనంతపురం : అనంతపురం జిల్లా హిందూపురంలో స్పన్ సిల్క్ పరిశ్రమకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్పన్ సిల్క్ పరిశ్రమకు ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని అద్దె విధానంలో కేటాయించేందుకు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచార ప్రచార శాఖ మంత్రి గీతారెడ్డి విలేఖర్లకు వెల్లడించారు.