తిరుమలలో అణివార ఆస్థానం
తిరుపతి : తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో గురువారం అణివార ఆస్థానం నిర్వహించనున్నారు. స్వామివారి వార్షిక ఆదాయ వ్యయాల ప్రారంభ సూచికగా ఈ ఆస్థానాన్నినిర్వహించడం ఆనవాయితి. ఆలయం బంగారు వాకిలిలోని మహామణి మంటపంలో ఉత్సవర్లు, విష్వక్సేనుల వారిని వేర్వేరు పీఠాలపై ఉంచి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆర్జితసేవలైన తోమాల, అర్చన, తిరుప్పావడమ, కాళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం తదితర సేవలను రద్దు చేశారు. సాయంత్రం స్వామివారు ఎనిమిది లక్షలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పుష్పపల్లకిలో మాడవీధులలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
News Posted: 16 July, 2009
|