చిత్తూరు : జిల్లాలోని శ్రీకాళహస్తిలో అమ్మవారి ఆలయంలో భక్తులపై తేనటీగలు బీభత్సం సృష్టించాయి. స్థానిక పొన్నాంబ ఆలయంలో భక్తులపై అకస్మాత్తుగా వందలాది తేనెటీగలు దాడి చేయడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. అయినా తేనెటీగలు భక్తులను కుట్టనే కుట్టాయి. ఈ తేనటీగల దాడిలో 20 మంది భక్తులు గాయపడ్డారు.