గుంటూరు : ఓ స్కూల్ బస్స్ బోల్తా పడడంతో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కసుకర్రు సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. డ్రైవర్ సెల్ ఫోన్లో మాట్లాడుతూ బస్సును నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.