అధికారులకు సురేఖ వార్నింగ్
వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా సహించేది లేదని, అలాంటి వారికి శిక్ష తప్పదని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ లో స్పష్టం చేశారు. హౌసింగ్ అధికారులతో ఆమె సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇందిరమ్మ గృహా నిర్మాణ పథకాల్లో అవినీతి రాజ్యమేలుతోందని, మున్ముందు అటువంటి అవినీతికి పాల్పిడేత శిక్ష తప్పదని అధికారులను ఆమె హెచ్చరించారు. అర్హులైన లబ్దిదారులకు పక్కా ఇళ్ళు ఇప్పించేందుకు అధికారులు కృషి చేయాలని ఆమె కోరారు.
News Posted: 17 July, 2009
|