టీచర్ల కౌన్సెలింగ్ కు బ్రేక్
నెల్లూరు : జిల్లాలో ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ కు అర్ధాంతరంగా ఆగిపోయింది. శుక్రవారం జరగాల్సిన మేధమెటిక్స్ టీచర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎంతో కాలంగా మౌలిక సదుపాయాలు లేని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, న్యాబద్ధంగా కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో టీచర్ల కౌన్సెలింగ్ కు బ్రేక్ పడింది.
News Posted: 17 July, 2009
|