గుంటూరు : గుంటూరు జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదిమంది అధికారులు గాయపడ్డారు. గుంటూరు-నరసరావుపేట ప్రధాన రహదారుల్లోని ఫిరంగిపురం వద్ద ఓ జీపు బోల్తా పడిన దుర్ఘటనలో నాగార్జున సాగర్ కెనాల్ బ్రాంచ్ అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. జీపు ఫిరంగి పురం సమీపంలో తక్కెళ్ళపాడుకు చేరుతుండగా అదుపు తప్పిన జీపు పక్కనే ఉన్న పంటకాల్వలోకి పడిపోయింది. దీనితో కెనాల్ పనులును పర్యవేక్షించానికి బయలుదేరిన అధికారులు తీవ్రంగా గాయపడ్డారు.