అనంతపురం : ఓ రైతు బ్యాంకు నుండి డబ్బు డ్రా చేసుకుని ఇంటిముఖం పట్టగా గుర్తుతెలియని దుండగులు ఆ రైతు వద్ద నుంచి డబ్బును దొంగలించి పరారైయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సింటికేట్ బ్యాంక్ నుంచి సొమ్మును డ్రా చేసుకుని వస్తున్న ఓ రైతు వద్ద నుంచి సొమ్మును దొంగలు ఎత్తుకుపోయారు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశాడు. రూ.2లక్షలను బ్యాంక్ నుంచి డ్రా చేసుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన నగదు ఎత్తుకుపోయారని బాధితుడు పోలీసులు వద్ద వాపోయాడు.