నెల్లూరు : పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్థినులు అనారోగ్యానికి గురైయ్యారు. నెల్లూరు జిల్లా రావూరు ప్రాధమికోన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం భోజనం తిన్న 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో వారందరినీ రావూరు ఆస్పత్రికి తరలించారు.