గుంటూరు : గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమనిలో బియ్యం అక్రమ నిల్వలపై విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడులు జరిపారు. ఈ దాడుల్లో సుమారు 70 లక్షల రూపాయలు విలువగల 25 లారీల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్ల యాజమాన్యంపై వారు కేసులు నమోదు చేశారు.