`సలహాలూ ఇవ్వండి'
వరంగల్ : ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ లోపాలను ఎత్తిచూపుతూనే... సలహాలు, సూచనలు ఇస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు - లోక్ సభ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాసమస్యలు పరిష్కరిస్తామని గొప్పలు చెప్పిన నేతలు అసెంబ్లీ, పార్లమెంట్ లోమాత్రం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించకుండా వ్యక్తిగత ప్రయోజనాలు పొందేందుకు పాకులాడుతున్నారని ఆమె అన్నారు. ప్రతిపక్షాలు ప్రజాసమస్యలకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వాలకు సలహాలు, సూచనలు ఇస్తే ఎంతో బాగుంటుందన్నారు.
News Posted: 22 July, 2009
|