తిరుపతి : ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన తిరుపతిలో వ్యాపరస్తులు బుధవారం ఆందోళన చేపట్టారు. అలిపిరిలో చిన్న వ్యాపరస్తులపై టిటిడి సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడంతో వారు ఆందోలన చేపట్టారు. ఈ దాడిలో పలువురు వ్యాపారులు తీవ్రంగా గాయపడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది దాడికి నిరసనగా వ్యాపరస్థులు ఆందోళన చేపట్టారు. దాంతో తిరుమలకు వెళ్ళే వాహనాలు అలిపిరిగేట్ వద్ద భారీ సంఖలో నిలిచిపోయాయి.