ముంపు బాదితులకు ఊరట
శ్రీశైలం : శ్రీశైలం ముంపు బాధితుల కుటుంబాలకు సిఎం తీపి కబురు చెప్పారు. శ్రీశైలం ముంపుబాధిత కుటుంబాలకు త్వరలో ఉద్యోగాలు దక్కనున్నాయి. బుధవారం హైదరాబాద్ లో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దీనికి ఆమోద ముద్ర వేసారు. దీంతో శ్రీశైలం ముంపు బాధితుల సమస్యకు కొద్దిపాటి ఊటర కలగనుంది. అర్హులైన వారందరికీ త్వరలో ఉద్యోగాలు దక్కనున్నాయి. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, గద్వాలకు చెందిన చిన్న తరహా పరిశ్రమ శాఖ మంత్రి డి.కె.అరుణల వినతితో ముఖ్యమంత్రి దీనిపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ దమయంతి, ఇతర రెవెన్యూ అధికారులు, మంత్రి జూపల్లి ఈ సమీక్షకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి పాలమూరు జిల్లాకు సంబంధించిన శ్రీశైలం ముంపుబాధితుల సమస్యపై ప్రత్యేకంగా సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం ఇది ప్రథమం.
News Posted: 23 July, 2009
|