విఐపీ దర్శనాల కుదింపు
తిరుపతి : పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఇందుకోసం శ్రీవారి సేవా టికెట్లు, విఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసే ప్రసక్తి లేదని టీటీడీ చైర్మన్ ఆదికేశవుల నాయుడు తెలిపారు. భక్తుల రద్దీకీ అనుగుణంగా సేవా టిక్కెట్లతో పాటు విఐపీ దర్శనాలను కుదిస్తామని ఆయన తెలిపారు.
News Posted: 27 July, 2009
|