కార్గిల్ వీర జవాన్లకు జోహార్లు
నిజామాబాద్: దేశం కోసం ప్ర్రాణాలు అర్పించిన కార్గిల్ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ నగరంలో ఆదివారం రాత్రి టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఫులాంగ్ అంబేద్కర్ విగ్రహం నుంచి కొవ్వొత్తుల ప్రదర్శన ప్రారంభించి పురవీధుల గుండా సాగుతూ ఎల్లమ్మ గుట్ట చౌరస్తాలోని అమరవీరుల స్థూపం వరకు కొనసాగింది. కార్గిల్ అమర వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. టిఎన్ఎన్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పుప్పాల రవి మాట్లాడుతూ దేశంకోసంప్రాణాలు అర్పించిన వీర జవాన్లను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యువతీ, యువకులు దేశభక్తిని కలిగి ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు సంపత్,సల్లా ప్రవీణ్, లక్ష్మణ్, రవీంద్రనాయక్, రాజేష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
News Posted: 27 July, 2009
|