నిజామాబాద్ : పెళ్ళిబాజాలతో కళకళలాడాల్సిన ఇల్లు ఒక్కసారిగా కళాహీనంగా మారిపోయింది. కాళ్ళపారాణి ఆరకముందే పెళ్ళికొడుక్కి నిండునూరేళ్ళు నిండిపోయాయి. ఎడ్లపల్లి మండలం జానకంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని కోనేటిలో స్నానానికి దిగిన పెళ్ళికొడుకు నీటిలో మునిగి చనిపోయాడు. ఈ విషాద సంఘటన నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం జరిగింది. దీంతో మృతుడి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.