అనంతపురం : అనంతపురం జిల్లా ఉపాధి హామీ పనుల్లో అవినీతికి పాల్పడిన ఫీల్డ్ ఆఫీసర్లపై సస్పెన్షన్
వేటు పడింది. తలపుల మండలం పరిధిలోని పలుగ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీ పనుల్లో సుమారు కోటి రూపాయలు స్వాహా అయినట్లు శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో వెల్లడయింది. దీంతో అయిదుగురు ఫీల్డ్ ఆఫీసర్లపై ప్రాజెక్టు డైరెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు.