శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు
తిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతిలో శనివారం నుండి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. శుక్రవారం రాత్రి ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేయనున్నారు. ఈ మూడు రోజుల్లో ఉదయం 9 గంటలకు తిరుమంజనం నిర్వహిస్తారు. తొలిరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఉభయనాంచారీ సమేతుడైన మలయప్పస్వామికి విశేష సమర్పణ, ఆరు గంటలకు మాడ వీధుల్లో ఊరేగింపు సాగుతాయి. మరుసటి రోజున పన్నెండు గంటలకు మూలవర్లు, ఉత్సవర్లకు పవిత్ర సమర్పణ, విమాన ప్రాకారం, ధ్వజస్తంభం మీదుగా శ్రీవరాహస్వామి ఆలయం వరకు ఊరేగింపు ఉంటాయి.
News Posted: 31 July, 2009
|