కిషోర్ కు ఉద్యోగరత్న అవార్డు
కడప : ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మకమైన భారతీయ ఉద్యోగరత్న అవార్డు ఈ సంవత్సరం జి.సాయికృష్ణ కిషోర్ కు దక్కింది. రాజంపేట డివిజన్ పరిధిలోని పెనగలూరు మండలం కంబాలకుంటకు చెందిన ఆయన వ్యాపారపరంగా ముందడుగు వేశారు. వివిధ రకాల వస్తువులను దుబాయ్ కత్తర్ వంటి దేశాలకు ఎగుమతి చేయడం, అక్కడి నుంచి కొన్నింటిని దిగుమతి చేసుకోవడం ద్వారా జాతీయ ఆర్థికాభివృద్ధికి కృషి చేసినవారిలో సాయికృష్ణ కిషోర్ ఒకరు. జాతీయ ఆర్థికాభివృద్ధికి కృషి చేసినవారికి అందించే ఈ అరుదైన పురస్కారాన్ని వ్యక్తిగతంగా కృషి చేసినందుకు మహారాష్ట్ర ప్రభుత్వం 2008-2009 కు గాను కిషోర్ కు ఈ అవార్డును అందజేసింది. అవార్డు అందుకుని రాజంపేటకు వచ్చిన సాయికృష్ణ కిషోర్ ను పలువురు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన విలేఖరులుతో మాట్లాడుతూ ఎంతో ప్రతిష్ఠాత్మకమైన భారతీయ ఉద్యోగరత్న అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సాయికృష్ణ కిషోర్ అన్నారు. తన తల్లి పేరిట నెలకొల్పిన సీతా గ్రూపు ద్వారా మనప్రాంతానికి చెందిన అనేక ఆహార వస్తువులను దుబాయ్, కత్తర్ వంటి గల్ఫ దేశాలకు ఎగుమతి చేస్తున్నామని కిషోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎం.ఎల్.నారాయణ, జిపిఆర్ యాక్సెస్ పౌండేషన్ అధ్యక్షులు జగదీష్ కుమార్, యువనాయకులు ఊటుకూరు రమణారావు తదితరులు పాల్గొన్నారు.
News Posted: 1 August, 2009
|