గుంటూరు : త్రివేండ్రం - హైదరాబాద్ మధ్య నడిచే శబరి ఎక్స్ ప్రెస్ లో తలెత్తిన సాంకేతిక కారణాల అనుపాలెం వద్ద ఆగిపోయింది. ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తినట్లు అధికారులు తెలిపారు. దీంతో గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెం వద్ద శబరి ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మరమ్మత్తులు చేపట్టారు.