ఒక చదువుకు రెండు డిగ్రీలు
కాకినాడ : విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే రెండు డిగ్రీల ప్రోగ్రామ్ ను జెఎన్ టియు వైస్ ఛాన్సలర్ డా.అల్లం అప్పారావు ప్రారంభించారు. ఈ డిగ్రీ విధానం వల్ల దేశ, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో స్వీడన్ యూనివర్శిటీ కో ఆర్డినేటర్ డా.వి.గురుదత్ తో పాటు వీసీ పాల్గొని ప్రసంగించారు. అప్పారావు మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడ్డ జెఎన్ టియు పూర్వ విద్యార్థులు అందరూ భాగస్వాములై ఇకపై తాము చేసే పరిశోధనలకు జెఎన్ టియు వేదికగా నిలిచేలా చొరవ చూపాలని కోరారు. ఈ నూతన విద్యావిధానంలో ప్రవాస భారతీయులతో పాటు, అమెరికా, హాంకాంగ్, చైనా, సింగపూర్ వంటి విదేశీ విద్యార్థులు కాకినాడ వర్శిటీలో విద్యనభ్యసించేందుకు వీలుగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.
ఫారిన్ యూనివర్శిటీస్ అల్యూమినా రిలేషన్స్ డైరెక్టర్ పి.ఉదయభాస్కర్ మాట్లాడూతు కాకినాడ జెఎన్ టియులో మొదటి సంవత్సరం చదివిన విద్యార్థులు రెండో సంవత్సరం తమ చదువును స్వీడన్ లోని బ్లెకింగ్ యూనివర్శిటీలో పూర్తి చేయవచ్చన్నారు. సిగ్నల్ ప్రాసెసింగ్ లో జెఎన్ టియు నుంచి ఎంటెక్ డిగ్రీ, స్వీడన్ వర్శిటీ నుంచి ఎమ్మెస్సీ డిగ్రీ రెండు ధ్రువపత్రాలను ఒకేసారి పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్టార్ వి.రవీంద్ర, ఎయు వర్శిటీ ప్రొఫెసర్ డా.ఎం.జగన్నాధ రావు, డైరెక్టర్లు సత్యప్రసాద్, పద్మరాజు, ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.
News Posted: 3 August, 2009
|