గల్లంతైన విద్యార్థి
కర్నూలు : స్నేహితులతో కలిసి కెసి కెనాల్లో ఈతకు వెళ్ళిన విద్యార్థి గల్లంతయ్యాడు. నందికొట్కూరులోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థి తిరుమలేష్ తన స్నేహితులైన ప్రవీణ్, దిలీప్, దౌలత్లతో కలిసి కెసి కెనాల్కు ఈతకు వెళ్ళారు. గట్టు మీద నుండి కెనాల్లోకి తిరుమలేష్ ఈతకు దూకాడని, నీరు వేగంగా పోతుండడం వలన తమ కళ్ళెదుటనే స్నేహితుడు కొట్టుకుని పోయాడని విద్యార్థులు తెలిపారు. తన కళ్ళ ముందే నలుగురు విద్యార్థులు ఈత కొడుతూ ప్రాణపాయ స్థితిలో ఉండడం గమనించిన రజకుడు ప్రాణాలకు తెగించి కెనాల్లో దూకి ముగ్గురిని కాపాడినా తిరుమలేష్ను మాత్రం కాపాడలేకపోయినట్లుగా విద్యార్థులు తెలిపారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తిరుమలేష్ తల్లి శరవమ్మ నా కుమారుడు ఏమయ్యాడు, ఎప్పుడొస్తాడంటూ రోదిస్తూ కనిపించిన ప్రతి వారిని అడగడంతో ఆ కాలనీలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. సమీపంలో బట్టలు పిండితున్న రజకుడు తమ పిల్లల ప్రాణాలను కాపాడినందుకు తల్లితండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలేష్ గల్లంతైన విషయం తెలుకున్న పోలీసులు వెంటనే అతని ఆచూకికై ప్రయత్నిస్తున్నారు.
News Posted: 3 August, 2009
|