ఘనంగా హయగ్రీవ జయంతి వేడుకలు
ఏలూరు : స్థానిక పడమర వీధిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో శ్రీ హయగ్రీవ జయంతిని ఘనంగా నిర్వహించారు. అర్చకస్వాములు రత్నాకరం, శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో హయగ్రీవ స్వామికి పంచామృత అభిషేకాలు, విశేష అలంకరణలు, సహస్ర నామార్చనలు చేశారు. నక్షత్ర కుంభహారతులను హర్చకస్వాములు ఇచ్చారు. విద్యార్థినీ విద్యార్థులు, స్వామివారిని దర్శించుకుని తమకు విద్యాభివృద్ధి కలగాలని కోరుకుంటూ పూజలు చేశారు. కార్యనిర్వాహణాధికారి ఎం.రాధ, సిబ్బంది కార్యక్రమాలను పర్యవేక్షించారు.
News Posted: 6 August, 2009
|