వరంగల్ : ప్రేమ పేరుతో దాడికి గురై చికిత్స పొందుతున్న శ్రీలత అనే విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. నర్సంపేట రామకృష్ణ డిగ్రీ కాలేజీలో అమీనాబాద్కు చెందిన శ్రీలత ఫైనలియర్ చదువుతోంది. ఇదే కాలేజీలో ఫైనలియర్ పూర్తి చేసుకున్న నాగరాజు అనే విద్యార్థి ప్రేమించమంటూ శ్రీలత వెంట పడుతుండేవాడు. అంతేకాక నాగరాజు అప్పుడప్పుడూ బ్లేడుతో కోసుకుని ఆమెను బెదిరిస్తుండేవాడు. తనను ప్రేమించనందుకు శ్రీలతపై కూడా బ్లేడుతో రెండు రోజుల క్రితం నాగరాజు దాడి చేశాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు నాగరాజును చితక బాదారు. నాగరాజు తనపై దాడి చేయడంతో మానసికంగా కృంగిపోయిన ఆమె విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.