గుంటూరు : గుంటూరు జిల్లాలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో శుక్రవారం ఆరు నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. గురజాల మండలం దైదలో ఈ నాటు బాంబులను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో బాంబులు దాచిపెట్టినట్లు సమాచారం అందడంతో పోలీసులు విస్తృతంగా జిల్లాలో తనిఖీలు నిర్వహించారు.