ఆర్టీసీ 'హ్యాట్రిక్'
నెల్లూరు : రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ వరుసగా మూడో సంవత్సరం కూడా భారీ లాభాలు ఆర్జించి హ్యాట్రిక్ సాధించిందని సంస్థ ఎండీ దినేష్ రెడ్డి వెల్లడించారు. ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఆక్యుపెన్సీ రేషియో ఓ.ఆర్ 72 శాతం పెరిగిందని ఆయన తెలిపారు. నెల్లూరు రీజియన్ లో ఆర్టీసీ లాభాల్లో పయనించడానికి కృషి చేసిన డ్రైవర్లను, కండక్టర్లను సన్మానించి, ప్రసంసా పత్రాలను దినేష్ రెడ్డి అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నెలల్లో జిల్లా ఆర్టీసీ విభాగం 60 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందని తెలిపారు.
News Posted: 7 August, 2009
|