ప్రాణం తీసిన ప్రేమ పాశం
గుంటూరు : 'ప్రేమ' అనే రెండక్షరాల వెనుక రెండు మనసుల కలయిక కూడా ఉంటుంది. కలిసిన మనసులు ఒకటైతే ఆ ఆనందం వర్ణనాతీతం. అదే వికటిస్తే ప్రాణాలను తీసుకోవడమే నేటి విద్యార్థినులకు పరిపాటయింది. ప్రేమ పేరుతో ఎన్ని మోసాలు జరుగుతున్నా దానికే యువత ఎక్కువ ఆకర్షితులై పెద్దల మాటలను తోసిరాజంటారు. రెండు చేతులు కలిస్తేనే చప్పుడైనట్లు, ప్రేమ కూడా రెండు మనసులు కలిస్తేనే అది కడదాకా నిలుస్తుంది. లేదంటే విచారమే మిగుల్తుంది. విద్యార్థినులూ బహు పరాక్. ప్రేమ పేరుతో చెప్పే మాటల గారడిలో విద్యార్థినులు తొందరగానే పడిపోతుంటారు. తమకున్న విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతుంటారు. చివరకు మిగిలేది అవమానం, ఆత్మహత్య చేసుకోవడం. తాజాగా జరిగిన ఈ ఉదంతమే దీనికి నిదర్శనం. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఎంబీఏ విద్యార్థిని శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ పేరుతో లొంగదీసుకున్న సహ విద్యార్థి ఆపై ఆమెను నిర్లక్ష్యం చేయడంతో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శవాన్ని పోస్ట్ మార్టంకు తరలించి విచారణ ప్రారంభించారు.
News Posted: 8 August, 2009
|