ఒరిగిన ధ్వజస్తంభం
గుంటూరు : గుంటూరు జిల్లా అమరావతి దేవస్థానంలో ధ్వజస్తంభం ఒరిగింది. దేవునికి ప్రాణం లాంటిది ధ్వజస్తంభం. సాదారణంగా ధ్వజస్తంభం వంద సంవత్సరాలు ఉండాలనీ, ధ్వజస్తంభం విరిగితే సరిచేసి మళ్ళీ ప్రతిష్టిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. 1977లో తుఫానుకు ధ్వజస్తంభం కూలిపోయిందన్నారు. తరువాత ఆ సంవత్సరంలోనే ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రస్తుతం ఒరిగిన ఉన్న ధ్వజస్తంభం అదేనని, ధ్వజస్తంభం విరిగితే ఆలయ అధికారులుతో మాట్లాడి మళ్లీ సరిచేసి ప్రతిష్టిస్తామన్నారు.
News Posted: 10 August, 2009
|