తిరుపతి : జిల్లాలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది విద్యార్థినులు గాయపడ్డారు. వెంకటేశ్వరా పెరుమాళ్ కు చెందిన కళాశాల బస్సులో విద్యార్థినులను తీసుకుని వస్తుండగా చిత్తూరు జిల్లా పుత్తూరు బైపాస్ రోడ్డుపై ఎదురుగా వస్తున్న మరో ప్రైవేట్ బస్సును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడన వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.