యువజన నేతల బాహాబాహీ
తిరుపతి : నగర కాంగ్రెస్ పార్టీలో వర్గ భేదాలు భగ్గుమన్నాయి. శుక్రవారం తిరుపతిలో జరిగిన నగర యువజనకాంగ్రెస్ సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ వర్గాలు కుర్చీలతో కొట్టుకున్నారు. ఈ రోజు జరిగిన యువజన కాంగ్రెస్ సమావేశంలో కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు యువజనకాంగ్రెస్ అధ్యక్షడు అజయ్ ప్రకటించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ వర్గానికి చెందిన మిగిలిన కార్యవర్గ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దాంతో వాగ్వాదం మొదలై రెండు వర్గాల యువజన నేతలు కుర్చీలతో బాహాబాహీకి దిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ పిఆర్పీకి సహకరించారని ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కరుణాకర రెడ్డి వర్గీయులు రోడ్డుపై ఆందోళనకు దిగారు.
News Posted: 14 August, 2009
|