తిరుమలలో పెరిగిన రద్దీ
తిరుపతి : శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా తిరుమల తిరుపతిలో భక్తులు కిటకిటలాడుతున్నారు. వరుసగా మూడు రోజులు సెలవలు రావండతో మరింత రద్దీ పెరిగింది. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు మొత్తం 28 కంపార్ట్ మెంటుల్లో భక్తులు బారులు తీరారు. దేవదేవుని దర్శనానికి 9 గంటల సమయం పడుతోంది. నేడు ఆలయంలో జరిగే గోకులాష్టమి, శనివారం జరిగే ఉట్లోత్సవం సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేశారు.
News Posted: 14 August, 2009
|