గుంటూరు : మంగళగిరిలో మెడిసిన్ చదువుకుంటున్న వైద్య విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ ఆర్ ఐ పారా మెడికల్ కళాశాలలో ఫిజియో ధెరపీ చదువుకుంటున్న విద్యార్థిని వాణిని దుండగులు హత్య చేసినట్లు సమాచారం. నంబూరులో పొలాల్లో విద్యార్థిని మృతదేహం కనిపించడంతో కంగారుపడిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఎన్ఆర్ఐ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థినిగా గుర్తించారు. పోలీసులు దుండగుల కోసం దర్యాప్తు ప్రారంభించారు.