విత్తనాలు జల్లిన కలెక్టర్
అనంతపురం : అనంతపురం జిల్లా కలెక్టర్ జనార్థన్రెడ్డి కాసేపు రైతుగా మారి వేరుశనగ విత్తనం సాగుచేశారు. రాప్తాడు మండల కేంద్రంలో ఏడవ నెంబర్ జాతీయ రహదారి పక్కన శివయ్య అనే రైతు తన పొలంలో వేరుశనగ విత్తనం నాటుతుండగా అక్కడికి వెళ్ళిన కలెక్టర్ కాసేపు కర్షకునిగా మారి వ్యవసాయంపై తనకున్నమక్కువను చాటుకున్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ఇప్పుడు విత్తనం విత్తితే పంట దిగుబడి వస్తుందన్న నమ్మకం ఉందా..? అని కలెక్టర్ ప్రశ్నించారు. దీంతో రైతులు ఇప్పుడు వేరుశనగ విత్తనాలు విత్తడం వల్ల పంట పండకపోయినా కనీసం పశువులకైనా మేత లభిస్తుందన్న ఆశతో వేస్తున్నామని కలెక్టర్ కు చెప్పారు. జిల్లా కలెక్టర్ రాకతో రాప్తాడు తహసీల్దార్ బాలానాయక్, డిప్యూటీ తహసీల్దార్ మదు సూదనరావు, వివిద మండల స్థాయి అధికారులు హాజరయ్యారు.
News Posted: 18 August, 2009
|