ఫొటో ఎగ్జిబిషన్
తిరుపతి : ఫొటోగ్రహీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 19 నుంచి 21 వరకు ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. స్థానిక మహతి కళామందిరంలోని పిరమిడ్ ధ్యాన మందిరంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫొటో ఎగ్జిబిషన్ ను నిర్వహించనున్నారు. తిరుపతి అమెచూర్ ఫొటో గ్రాఫర్స సొసైటీ ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి నీలకంఠేశ్వర్, అధ్యక్షుడు రేషిపో సోమవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. విజయవాడకు చెందిన ప్రముఖ ఛాయాచిత్ర గ్రాహకుడు శ్రీనివాసరెడ్డి ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
News Posted: 18 August, 2009
|