పిడుగుపాటుకు రైతు మృతి
కడప : కాశినాయన మండలం వరికుంట్ల గ్రామానికి చెందిన కొండా నారాయణరెడ్డి అనే రైతు సోమవారం పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. ఎద్దులతో పొలాన్ని చదునుచేస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం జోరందుకుంది. నారాయణరెడ్డి ఎద్దుల కాడిని విప్పి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో పిడుగు ఆయనపై పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అదే సమయంలో రూ.35వేలు విలువ చేసే ఓ ఎద్దుకూడా చనిపోయింది. ఇంటికి పెద్ద దిక్కు అయిన నారాయణరెడ్డి మృతి చెందడంతో ఆ కుటుంబం వీధినపడింది. మృతుడు నారాయణరెడ్డికి భార్య అనుసూయమ్మ, పెద్దకుమార్తె పెద్ద శివమ్మ, చిన్న శివమ్మ, సావిత్రి, కళావతి అనే నలుగురుకుమార్తెలు కలరు. వీరిలో పెద్ద శివమ్మకు మాత్రమే వివాహమైంది.
News Posted: 18 August, 2009
|