బారులు తీరిన భక్తులు
శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు శ్రీభమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకుని పవిత్ర పాతాళగంగలో స్నానాలాచరించారు. తదుపరి స్వామివార్ల దర్శనానికి క్యూలైన్ లలో బారులు తీరారు. మూడు రోజులు వరుసగా సెలవులు రావడంతో భక్తుల రద్దీ ఎక్కువైంది. మన రాష్ట్రం నుంచే కాక తమిళనాడు, మహారాష్ట్ర తదితర ప్రాంతాలనుంచి భక్తులు అధికసంఖ్యలో స్వామివార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ఈఓ గోపాలకృష్ణా రెడ్డి స్వయంగా పర్యవేక్షణ చేశారు. పాలధార-పంచధార, సాక్షిగణపతి, హఠకేశ్వరం, మంత్రాలయం, శిఖరేస్వరంల వద్ద భక్తుల సందర్శనం కనిపించింది.
News Posted: 18 August, 2009
|