తెగిన రైల్వే విద్యుత్ వైరు
గుంటూరు: జిల్లాలోని తెనాలి నుంచి చెన్నై వెళ్లే మార్గంలో చుండూరు వద్ద రైల్వే విద్యుత్ హైటెన్షన్ వైరు తెగి కిందపడింది. దీనిలో విద్యుత్ ప్రవహిస్తుండటంతో చుండూరు రైల్వే స్టేషను సిబ్బంది ప్రయాణీకులను, గ్రామస్తులను ఇటువైపు రానియ్యకుండా చూశారు. దీంతో రైళ్ళకు విద్యుత్ సరఫరా నిలిచిపోయడంతో రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కృష్ణా, హౌరా, నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైళ్ళను నిలిపివేశారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో సిబ్బంది అక్కడకు చేరుకొని మరమ్మతు చర్యలు చేపట్టారు.
News Posted: 25 August, 2009
|