సుంకేశుల గేట్లు ఎత్తివేత
కర్నూలు : కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కర్నూలులోని సుంకేశుల బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చిచేరింది. దీంతో అధికారులు బ్యారేజీ 15 గేట్లను ఎత్తివేసి, 67 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
News Posted: 25 August, 2009
|