లోక్ సత్తా జిల్లా కమిటీ
హైదరాబాద్ : జిల్లాల వారీగా కొత్త కమిటీల ఎంపికకు లోక్ సత్తా పార్టీ అగ్ర నాయకత్వం విస్తృతస్థాయి కసరత్తు చేస్తోంది. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న సమీక్షలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సమర్థుల ఎంపికను ఏకాభిప్రాయ సాధనతో చేసేందుకు అగ్రనాయకత్వం అందరితో చర్చిస్తోంది. ప్రతి జిల్లా నుంచి వచ్చిన 14 మంది అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో పాటు, ఎక్కువ మంది నాయకత్వ బాధ్యతల్ని ఆశిస్తుండటంతో ఎంపిక ప్రక్రియ అనుకున్న సమయంకంటే ఆలస్యమవుతోంది. 25న సమీక్షించిన కరీంనగర్ కమిటీని మాత్రమే 26న ప్రకటించారు. పార్టీ ఉపాధ్యక్షుడు డివివిఎస్ వర్మ, ప్రధాన కార్యదర్శి జి.మాల్యాద్రి ఆధ్వర్యంలో 26వ తేదీన మొదలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సమీక్ష కొనసాగుతోంది. జిల్లాల వారీగా బృందాలతో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా చర్చలు చేస్తూ అభిప్రాయాలను సేకరిస్తున్నారు. వీరితో పార్టీ అధ్యక్షుడు డా.జయప్రకాష్ నారాయణ్ కూడా చర్చించాక కమిటీలకు తుదిరూపు ఇస్తారని, 2వ తేదీ వరకూ సమీక్షలు జరుగుతాయని పార్టీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ వి.రామచంద్రయ్య, అధికార ప్రతినిధి వి.లక్ష్మణ్ బాలాజీ బుధవారం ఇక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాకు తెలిపారు. కరీనంగర్ జిల్లా కమిటీని, కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జీలను వారు ప్రకటించారు.
లోక్ సత్తా కరీంనగర్ జిల్లా కమిటీ: అధ్యక్షుడు ఎం.విద్యాసాగరరావు, ఉపాధ్యక్షులు: పి.రామారావు, శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి: కె.వై.విద్యాసాగరరావు, కోశాధికారి: కె.లక్ష్మణ్ బాబు, కార్యనిర్వాహక కార్యదర్శి: టి.అనిల్ కుమార్, సహాయ కార్యదర్శులు: బోగా రవికుమార్, ఎం.వి.రమణ, రఫీదుద్దీన్, అధికార ప్రతినిధి: వంశీధర రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిలు: ధర్మపురి-డి.రవీందర్, సిరిసిల్ల- సంతోష్, చొప్పదండి-టి.బాబు, కరీనంగర్-రాజారెడ్డి, జగిత్యాల-ఎం.విద్యాసాగరరావు, పెదపల్లి-శ్రీనివాసరావు, రామగుండం-అనిల్ కుమార్.
లోక్ సత్తాకు వేలాదిమంది సభ్యులున్న నియోజకవర్గాలలో అందులో నాలుగోవంతు ఓట్లు కూడా రాలేదని, అందువల్ల సభ్యత్వ నమోదు విధానాన్ని మార్చి, సభ్యులే పార్టీని సొంతం చేసుకునే విధంగా అసోసియేటెడ్, ప్రైమరీ, ఎగ్జిక్యూటివ్, గౌరవ సభ్యత్వం అనే నాలుగు రకాలున్న నూతన సభ్యత్వ విధానాన్ని లోక్ సత్తా ప్రారంభించిందని... పెద్దసంఖ్యలో క్రియాశీల సభ్యుల నమోదు, మున్సిపల్ ప్రజాకార్యాచరణ జిల్లా కమిటీల తక్షణ ఎజెండాగా ఉంటాయని రామచంద్రయ్య, లక్ష్మణ్ బాలాజీ తెలిపారు.
News Posted: 26 August, 2009
|