రాజమండ్రి : రామచంద్రాపురం కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. రాజమండ్రి సబ్రిజిస్ట్రార్ ఉమాశంకర్ ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి అధికార శాఖ అధికారులకు దొరికిపోయారు. ఓ పని కోసం లంచం డిమాండు చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఉమాశంకర్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.