కొత్తపాలసీ 'జీవన్ మంగళ్'
(వేములసదానందం)
వరంగల్ : మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ జీవిత భీమ సంస్థ సరికొత్తపాలసీలను ప్రవేశపెడుతున్నదని, అందులో భాగంగానే 'జీవన్ మంగళ్' పాలసీని సెప్టెంబర్ 2న ప్రారంభించనున్నట్లు వరంగల్ సీనియర్ డివిజనల్ మేనేజర్ ఎవిఎన్ కుమార్ చెప్పారు. భారతీయ జీవితభీమా సంస్థ 52 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ మొదటి వారాన్ని వార్షిక వారోత్సవాలు జరుపుకొంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ వారోత్సవాల సందర్బంగా 'జీవన్ మంగళ్' అనే సరికొత్త పాలసీని ప్రవేశపెడుతున్నట్లు ఎవిఎన్ కుమార్ తెలిపారు.
1956లో 380.61 కోట్ల రూపాయల నిధితో ప్రారంభమైన సంస్థ మార్చి 31, 2009 నాటికి 8,07,317,43 కోట్ల రూపాయల నిధులను సమకూర్చుకోగలిగిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యంను దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా వ్యాపార ప్రణాళిక సంక్షేమ పథకాలలో 2009 మార్చి 31 నాటికి 5,29,525 కోట్ల రూపాయలు నిర్మాణరంగంలో 1,00,789 కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగిందన్నారు. ప్రజలతో, పాలసీ దారులతో విశ్వసనీయతను నిలబెట్టుకుంటూ 25,78 కోట్లు పాలసీలు అమలులో ఉంచగలిగామని కుమార్ చెప్పారు. సుశిక్షులైన ఉద్యోగులు, ఏజెంట్లతో సంస్థ పురోగాభివృద్ధిని సాధిస్తోందని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మార్కెటింక్ మేనేజర్ జి.రఘుపతి, అసిస్టెంట్ డిప్యూటీ శ్రీనివాసన్ కుమార్, కాశీనాథ్ లు పాల్గొన్నారు.
News Posted: 2 September, 2009
|