విజయవాడ : రాష్ట్ర ముఖ్యమంత్రి మిస్సింగ్ అన్న వార్తతో షాక్ కు గురైన ఓ అభిమాని గుండెపోటుతో మరణించారు. పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన చింతయ్య (45) బుధవారం ఇంటికి రాగానే టీవీలో హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తున్న ముఖ్యమంత్రి కనిపించడం లేదన్న వార్తలను చూసిన చింతయ్య వెంటనే గుండెపోటుకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగానే మృతి చెందాడు. ఈ ఘటనతో అతని కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.