ఇంటర్వ్యూలు వాయిదా
కర్నూలు : కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించాల్సిన ఇంటర్యూలు వాయిదా పడ్డాయి. చిన్న తరహా పరిశ్రమల స్థాపన కోసం అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు జిల్లా ఖాదీ బోర్డు, ఖాదీ కమిషన్, జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ఇంటర్వ్యూలకు సుమారు 800 మంది యువతీయువకులు తరలివచ్చారు. అయితే పాములపాడు, చిప్పగిరి జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించిన కోడ్ అమలులో ఉన్నందున ఇంటర్వ్యూలు నిర్వహించరాదని రెవెన్యూ అధికారులు సూచించడంతో ఇంటర్వ్యూలను ఈనెల 14వ తేదీకి వాయిదా వేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇంటర్వ్యూలు వాయిదా పడడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు నిరాశకు గురయ్యారు.
News Posted: 3 September, 2009
|