వరంగల్ : వరంగల్ జిల్లాలో గుర్తు తెలియని కొందరు దుండగులు ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కూల్చివేశారు. దీంతో విద్యార్థులు రోడ్లమీదే కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని గోవిందరాజుల గుట్టలో గత అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.